ప్రధానాంశాలు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు.
విచారణ అనంతరం CM Kejriwal ను అరెస్టు చేసే అవకాశం
అయితే ED విచారణ అనంతరం కేజ్రీవాల్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన పక్షంలో AAP పార్టీని ఎవరు నడిపిస్తారనేది తెలియాల్సివుంది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్కు ED నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
ప్రతిపక్ష సీఎంలందరిని జైల్లో పెట్టాలని బీజేపీ ప్లాన్ చేసిందన్న M.P రాఘవ్ చద్దా
అంతకుముందు బుధవారం AAP పార్టీ కి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, 2024 లోక్సభ ఎన్నికల్లో స్వేచ్ఛామార్గం పొందడానికి ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరినీ జైల్లో పెట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేసిందని అన్నారు.
కేంద్ర ఏజెన్సీలు మొదట కేజ్రీవాల్ను అరెస్టు చేసి, ఆపై జార్ఖండ్లోని హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మరియు ఎం.కె.స్టాలిన్ సహా ఇతర ముఖ్యమంత్రులను అనుసరిస్తాయని చద్దా అన్నారు. చద్దాతో పాటు ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ కూడా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందున ఆయనను అరెస్టు చేసే యోచనలో బీజేపీ ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా కేజ్రీవాల్ను అరెస్టు చేస్తే ఆయన స్థానంలో ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై పార్టీ ఆలోచించలేదని పలువురు నేతలు అన్నారు. ఆయనను అరెస్టు చేస్తే నాయకత్వ పాత్రపై పార్టీ సీనియర్ నేతలు నిర్ణయం తీసుకుంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని పార్టీ నేత ఒకరు వెల్లడించారు.
ఎక్సైజ్ పాలసీ స్కామ్లో కేజ్రీవాల్కు తొలిసారిగా E.D సమన్లు
మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్లతో సహా పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే కటకటాల వెనుక ఉన్నందున పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై చర్చ జరగనందున క్యాబినెట్ జైలు లోపల నుండి నడిచే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఆప్కి పెరుగుతున్న ఆదరణ బీజేపీకి ఇష్టం లేదని, అది తమకు ప్రత్యక్ష ముప్పు అని ఆ పార్టీ నేత వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీ స్కామ్లో కేజ్రీవాల్కు తొలిసారిగా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇదే కేసుకు సంబంధించి గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (C.B.I) ఆయనను ప్రశ్నించింది.