Cricket giants | అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో దేశం మొత్తం రామనామ స్మరణతో మారుమోగిపోతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమాన్ని తమ కండ్లారా చూసేందుకు సినీ, రాజకీయ, క్రీడా దిగ్గజాలు అయోధ్యకు తరలివెళ్తున్నారు.
Cricket giants | అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట నేపథ్యంలో దేశమంతా రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు సినీ, రాజకీయ, క్రీడా దిగ్గజాలు అయోధ్య బాట పట్టారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయోధ్య చేరుకున్నారు. సోమవారం ముంబై నుండి అయోధ్యకు విమానంలో బయల్దేరిన సచిన్ మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో దిగారు. అక్కడ విమానాశ్రయ అధికారులు సచిన్ కు ఘన స్వాగతం పలికారు.
అయోధ్య చేరుకున్న సచిన్, కోహ్లీ, కుంబ్లే (Cricket giants)
అనంతరం సచిన్ తన కారులో నూతనంగా నిర్మించిన రామమందిరానికి బయల్దేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు జరిగే రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ పాల్గొననున్నారు. సచిన్తో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, వెంకటేష్ ప్రసాద్, జడేజా, మిథాలీ రాజ్ కూడా అయోధ్య చేరుకున్నారు. వీరేకాకుండా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రవిచంద్రన్ అశ్విన్లు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరుకాబోతున్నారు.
Also Read | నేడే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుక..