Delhi CM Kejriwal | కేంద్రంలోని అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
Delhi CM Kejriwal | కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేసిందన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న కేజ్రీవాల్
మొత్తం 21 మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారని, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ను త్వరలో అరెస్టు చేస్తామని మా ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించారన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఇలా చేస్తోందన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్విట్టర్ (X) లో ట్వీట్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు.
ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఆఫర్ చేసిన BJP
ఇతర ఎమ్మెల్యేలతో కూడా టచ్లో ఉన్నాం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మీరు కూడా మాతో రావచ్చు. రూ.25 కోట్లు ఇస్తాం ఎన్నికల్లో ఆప్ పార్టీ టికెట్పై పోటీ చేయండంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ ఆఫర్ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
Also Read | నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్..?