కేంద్ర ఎన్నికల సంఘం (EC) మార్చి 16న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో గతంలో సీజ్ చేసిన అక్రమ డబ్బు గురించి వివరాలను విడుదల చేసింది. 2022-23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ₹3,400 కోట్ల అక్రమ డబ్బును సీజ్ చేసినట్లు EC వెల్లడించింది. 2017-18 ఎన్నికలతో పోలిస్తే ఈ డబ్బు విలువ 835% పెరిగినట్లు పేర్కొంది. ఈ డబ్బులో గుజరాత్-₹802 కోట్లు, తెలంగాణ-₹778 కోట్లు, రాజస్థాన్-₹704 కోట్లు, కర్ణాటక-₹384 కోట్లు, మధ్యప్రదేశ్-₹332 కోట్లు, మిజోరాం-₹123 కోట్లు, ఛత్తీస్గఢ్-₹78 కోట్లు, మేఘాలయ-₹74 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-₹57 కోట్లు, నాగాలాండ్-₹50 కోట్లు, త్రిపుర-₹45 కోట్ల డబ్బును సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Also Read | కవిత అరెస్ట్పై స్పందించిన CM రేవంత్ రెడ్డి.