Home   »  జాతీయం   »   Emergency landing: ముంబైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేమైందంటే.?

Emergency landing: ముంబైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేమైందంటే.?

schedule ranjith

విమాన ప్రయాణం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చిన గాల్లో ఉన్న ప్రాణాలు అటే గాలిలో కలిసిపోతాయి. తాజాగా 185 మంది వెళ్తోన్న విమానం అత్యవసరంగా ల్యాండ్ జరిగింది. విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.

బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించిన అధికారులు

ఓ ప్రయాణికుడి నుంచి బాంబు బెదిరింపు రావడంతో ఆకాశ విమానం… ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా దిగిన ఘటన శనివారం రోజు జరిగింది. 185 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆకాశ ఎయిర్ విమానం పుణే నుంచి ఢిల్లీకి వెళుతుంది. అయితే నా బ్యాగులో ఓ బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు బెదిరించాడు. దీంతో విమానాన్ని వెంటనే ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.

Emergency landing బ్యాగులో తనిఖీ… దొరకని అనుమానాస్పద వస్తువులు

బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో బెదిరింపులకు దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగును తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు. ఈ ఘటనపై దర్యాఫ్తు జరుపుతున్నారు. ప్రయాణికుడి మానసిక స్థితిని అంచనా వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.

ప్రయాణికుడి మానసికస్థితిని అంచనా వేస్తున్న అధికారులు

185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తోన్న ఆకాశ విమానం భద్రతాపరమైన హెచ్చరికలతో వెంటనే ముంబైకి మళ్లించామని, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిందని విమానయాన సంస్థ తెలియజేసింది. తనిఖీలు పూర్తయ్యాక విమానాన్ని ముంబై నుంచి ఢిల్లీకి పంపించినట్లు తెలిపారు.

Also Read: Saddula Bathukamma: హైదరాబాద్‌లో రేపు పొరపాటున కూడా ఈ రోడ్లపైకి వెళ్లొద్దు