Home   »  జాతీయం   »   బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8మంది మృతి..!

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8మంది మృతి..!

schedule mahesh

Explosion in fireworks factory | తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.

explosion-in-fireworks-factory-8-people-killed-!

Explosion in fireworks factory | తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. వెంబకోట్టై సమీపంలోని రాము దేవన్‌పట్టిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది.పరిసర ప్రాంతాల్లో భవన శిథిలాలు ఎగిరిపడ్డాయి.

ఈ ఘటనలో మొత్తం 8మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read | ఢిల్లీ ఛలో మార్చ్ లో విషాదం.. గుండెపోటుతో ఓ రైతు మృతి