Home   »  జాతీయం   »   మొక్కలకు నీళ్లు పోస్తూ 18వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి

మొక్కలకు నీళ్లు పోస్తూ 18వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి

schedule ranjith
Girl died after falling from 18th floor while watering plants

ఉత్తరప్రదేశ్‌ | ప్రమాదవశాత్తూ 18వ అంతస్తు నుంచి జారిపడ్డ ఓ 12వ తరగతి బాలిక అక్కడిక్కడే మృతి (Died) చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం ఈ ఘటన జరిగింది. బాల్కనీలో ప్రమాదవశాత్తూ సంభవించిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బిసార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ ప్రైడ్ సొసైటీలో బాలిక భవనంపై నుంచి పడి మృతి చెందిందని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవలే ఆమె 12వ తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు. అంతకుముందు రోజే, నోయిడాలో ఓ 7వ తరగతి బాలుడు పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని 22వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణాకి పాల్పడ్డాడు.

Also Read | భర్త ఫోన్ లాక్కోవడంతో భార్య ఆత్మహత్య