ఉత్తరప్రదేశ్ | ప్రమాదవశాత్తూ 18వ అంతస్తు నుంచి జారిపడ్డ ఓ 12వ తరగతి బాలిక అక్కడిక్కడే మృతి (Died) చెందింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం ఈ ఘటన జరిగింది. బాల్కనీలో ప్రమాదవశాత్తూ సంభవించిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బిసార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ ప్రైడ్ సొసైటీలో బాలిక భవనంపై నుంచి పడి మృతి చెందిందని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవలే ఆమె 12వ తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు. అంతకుముందు రోజే, నోయిడాలో ఓ 7వ తరగతి బాలుడు పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్లోని 22వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణాకి పాల్పడ్డాడు.
Also Read | భర్త ఫోన్ లాక్కోవడంతో భార్య ఆత్మహత్య