Home   »  జాతీయం   »   రిపబ్లిక్‌ డే రోజు పంజాబ్‌ CMను చంపేస్తామన్న ఖలిస్తానీ టెర్రరిస్ట్

రిపబ్లిక్‌ డే రోజు పంజాబ్‌ CMను చంపేస్తామన్న ఖలిస్తానీ టెర్రరిస్ట్

schedule mahesh

Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేదిత sikhs for justice (SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను చంపేస్తామంటూ హెచ్చరించాడు.

khalistani-terrorist-who-will-kill-punjab-cm

Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేదిత sikhs for justice (SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ మరోసారి బెదిరింపులకు దిగాడు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను హెచ్చరించారు.

పంజాబ్‌ CMను చంపేస్తామన్న Khalistani Terrorist పన్నూన్‌

జనవరి 26 రిపబ్లిక్ డే రోజున భగవంతమన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. గణతంత్ర దినోత్సవం రోజున పంజాబ్ సీఎంను చంపేందుకు గ్యాంగ్‌స్టర్లంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. భగవంత్ మాన్ ప్రభుత్వం పంజాబ్ లో గ్యాంగ్ స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తుంది. పంజాబ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

పన్నూన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డీజీపీ

ఈ బెదిరింపులపై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పందించారు. గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్‌ విధానాన్ని అవలంభిస్తోందన్నారు. పన్నూన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఖలిస్తాని ఉగ్రవాది పన్నూన్ ఇలా బెదిరింపులకు దిగడం ఇదేమి తొలిసారి కాదు.

గత కొన్ని రోజులుగా అనేక మంది భారతీయ నాయకులను చంపుతానని, ప్రసిద్ధ దేవాలయాలు, విమానాశ్రయాలను నాశనం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెలలో కూడా పార్లమెంట్‌ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా పంజాబ్ సీఎంను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపుతోంది.

Also Read: అమెరికా అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్న భారతీయ అమెరికన్‌..?