న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation) గురువారం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), Meta మరియు వారి అధీకృత భాగస్వామి సహకారంతో గురుగ్రామ్ ర్యాపిడ్ మెట్రోతో సహా అన్ని లైన్లకు తన వినూత్న వాట్సాప్ ఆధారిత టికెటింగ్ విధానాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది.
Delhi Metro లో వినూత్న వాట్సాప్ ఆధారిత టిక్కెట్ కొనుగోలు
Pelocal Fintech Pvt Ltd. జూన్లో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ను ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రయాణికులు ఈ సేవ యొక్క సౌలభ్యాన్ని పొందారు. ప్రయాణీకులు ఇప్పుడు వాట్సాప్లో +91 9650855800కి ‘హాయ్’ అనే సందేశాన్ని పంపి మెట్రో టిక్కెట్ ను పొందవచ్చు. లేదా మొత్తం నెట్వర్క్లో తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి మెట్రో టిక్కెట్ను కొనుగోలు చేయడానికి QR కోడ్ను స్కాన్ చేసి పొందవచ్చు.
“వాట్సాప్ మెజారిటీ భారతీయులకు మెసేజింగ్ ప్లాట్ఫారమ్, మరియు మెట్రో టిక్కెట్ను కొనుగోలు చేయడం ఇప్పుడు స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యునికి సందేశం పంపినంత సులభంగా టిక్కెట్ను పొందవచ్చు. ప్రయాణానికి సంబంధించినది” అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ కుమార్ వెల్లడించారు.