Home   »  జాతీయం   »   బీజేపీ IT, EDలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను భయపెడుతోందన్న స్టాలిన్

బీజేపీ IT, EDలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను భయపెడుతోందన్న స్టాలిన్

schedule mahesh

చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు చేసేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) బుధవారం మండిపడ్డారు.

బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించిన పార్టీలను బెదిరింపులకు గురిచేస్తున్నరు: స్టాలిన్

బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించిన పార్టీలను బెదిరింపులకు గురిచేన్నారని, కేంద్రంలోని B.J.P ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు అభిప్రాయాలు వ్యక్తం చేసినా బెదిరిస్తారు మరియు వారిపై ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లను ఉపయోగించి దాడులకు గురిచేస్తారన్నారు.

ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడనుంది: MK Stalin

మాకు అందిన సమాచారం ప్రకారం మొత్తం ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడనుంది. అందుకే ఓటమి భయంతో కేంద్రం ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తోందని D.M.K అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లోINDIA కూటమి అఖండ విజయం:CM

“భారత కూటమి” బీజేపీ కవచంలో ఉన్న చిచ్చును బయటపెడుతుందని, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని నిర్ధారిస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం సాధించిపెట్టేలా కృషి చేయాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వటం జరిగింది.