Home   »  జాతీయం   »   హైదరాబాద్ లో కొత్తగా మరిన్ని MMTS సేవలు

హైదరాబాద్ లో కొత్తగా మరిన్ని MMTS సేవలు

schedule sirisha

హైదరాబాద్: ప్రయాణికుల ప్రయోజనాల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) మేడ్చల్, లింగంపల్లి, హైదరాబాద్ మధ్య ఆరు కొత్త MMTS Services లను ప్రారంభించనుంది. దానికి తోడు ఉమ్దానగర్, సికింద్రాబాద్, ఫలక్‌నామా మధ్య ఆరు MMTS సర్వీసులను కూడా ప్రారంభిస్తారు.

SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం కార్యాలయానికి వచ్చే పోషకులు, ఎక్కువ దూరం ప్రయాణించే వారి అవసరాలను సులభతరం చేయడానికి ప్రధాన ప్రాముఖ్యత ఇవ్వబడిందని చెప్పుకొచ్చారు.

జంట-నగర ప్రాంతంలోని ప్రయాణికుల నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ సేవలు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మేడ్చల్-హైదరాబాద్ స్టేషన్ల మధ్య MMTS Services

ఇటీవల కాచిగూడ-బెంగళూరు, యశ్వంతపూర్- కాచిగూడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్ ను ప్రారంభించారు. సబ్-అర్బన్ ప్రయాణికులు ఉదయం, సాయంత్రం సమయంలో కాచిగూడ స్టేషన్‌కి కనెక్ట్ అయ్యేలా కనెక్టివిటీని, ప్రయాణం సులభతరం అవ్వడానికి లింగంపల్లి-ఉమ్దానగర్ మధ్య రాత్రి సమయాల్లో, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 2 MMTS సేవలను ప్రారంభించారు.

సబ్-అర్బన్ ప్రయాణికుల ప్రయోజనం కోసం మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-హైదరాబాద్, మేడ్చల్-లింగంపల్లి ప్రాంతాల మధ్య సేవలు పెరగనున్నాయి. ఇంకా మొదటిసారిగా మేడ్చల్-హైదరాబాద్ స్టేషన్ల మధ్య MMTS రైలు కనెక్టివిటీ ఏర్పాటుచేయనున్నారు.

గుంటూరు డివిజన్‌ పరిధిలోని పలు రైళ్లు రద్దు

మరోవైపు గుంటూరు డివిజన్‌ పరిధిలోని ఐదు స్టేషన్ల మధ్య మౌలిక వసతుల కల్పన పనుల కారణంగా రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. అక్టోబరు 9 నుంచి 15 వరకు కాచిగూడ, నడికుడ, గుంటూరు, సికింద్రాబాద్‌, మెదక్‌ల మధ్య రైలు సర్వీసులు నిలిపి వేయబడ్డాయి.