Mumbai: ముంబయిలోని ఖురేషీ నగర్లోని కుర్లా ఈస్ట్లోని మురికి వాడలో శుక్రవారం (ఈ రోజు) తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు అయినట్లు ఇప్పటి వరకు నివేదించబడలేదు.
శుక్రవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడి వారు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల చాలా ఇళ్లు దగ్ధమయ్యాయి. చాలా మంది ప్రజలు నిరాశ్రయులైనారు.
“ఇంకా ప్రాణనష్టానికి సంబంధించిన నివేదికలు ఏవీ నివేదించబడలేదు. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు ”అని అధికారులు చెప్పారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరో చోట బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది.
ఖార్ఘర్ వద్ద బస్సులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో NMMT బస్సులోని 15 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు.
మూడేళ్లలో ఈ మోడల్ NMMT బస్సులపై ఇలాంటి అగ్నిప్రమాదం జరగడం ఇది తొమ్మిదవది. బస్సు గమ్యస్థానానికి చేరిన తర్వాత మంటలు చెలరేగాయి.
బస్సు గమ్యస్థానానికి చేరుకుని ప్రయాణికులు కిందకు దిగిన తర్వాత మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుండి పొగలు రావడంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణీకులను త్వరగా దిగేలా చేశాడు.
కండక్టర్ మంటలను ఆర్పే యంత్రాన్ని ఉపయోగించారని అయితే మంటలు త్వరగా వ్యాపించాయని అగ్నిమాపక అధికారి ప్రవీణ్ బోడాకే తెలిపారు.
“అశోక్ లేలాండ్” నుంచి కొనుగోలు చేసిన 567 బస్సుల్లో మంటలు చెలరేగిన బస్సులు ఉన్నాయని NMMT జనరల్ మేనేజర్ యోగేష్ కదుస్కర్ తెలిపారు. రవాణా సంస్థ బస్సు తయారీదారుని సాంకేతిక తనిఖీని కోరింది.