Home   »  జాతీయం   »   Muzaffarnagar: ఆస్పత్రిలో ఏసీ ఆన్ చేసిన డాక్టర్..ఇద్దరు శిశువులు మృతి

Muzaffarnagar: ఆస్పత్రిలో ఏసీ ఆన్ చేసిన డాక్టర్..ఇద్దరు శిశువులు మృతి

schedule ranjith

యూపీలోని ముజఫర్‌నగర్‌ (Muzaffarnagar) లో ఘోరం జరిగింది. షమ్లీ జిల్లాలోని ఓ ప్రైవేటు క్లినిక్‌లో డాక్టర్‌ పడుకునేందుకు రాత్రంతా AC వేసి ఉంచాడు . చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు తెల్లారేసరికి మృతి చెందారు.

ఉత్తరప్రదేశ్‌లోని (Muzaffarnagar) షామ్లిలో ఘటన

ఆసుపత్రిలో చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో జరిగింది. శనివారం (సెప్టెంబర్ 23న) రాత్రి నిద్రపోయే ముందు డాక్టర్ గదిలోని AC పెంచారు. తెల్లారి లేచి చూసేసరికి శిశువులు ఇద్దరూ మృతి చెంది కనిపించారు. బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మెడికల్ ఆఫీసర్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నీతూను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. నిందితుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వని శర్మ హెచ్చరించారు.

హాస్పిటల్ ముందు ఆందోళన

శిశువులు శనివారం కైరానాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన్మించారు. అదే రోజు ప్రైవేటు క్లినిక్‌కు తరలించారు. అక్కడ చికిత్స కోసం వారిని ఫొటోథెరపీ యూనిట్‌కు తరలించారు. అక్కడ వైద్యుడు ఏసీ ఆన్‌చేసి రాత్రంతా నిద్రపోయాడు. ఉదయం తమ చిన్నారులను చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు వారు చనిపోయి కనిపించారు. దీంతో డాక్టర్ నీతూపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.

Also Read: C-295 MW రవాణా విమానాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్.!