మహారాష్ట్ర: మహారాష్ట్ర లోని నాగ్పూర్ (Nagpur) నగరంలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ అధికారి ఓ వ్యక్తి చెంపపై బలంగా కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ప్రధానాంశాలు:
- మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసిన ఘటన
- విచక్షణ కోల్పోయిన పోలీసు అతడి చెంప ఛెళ్లుమనిపించిన వైనం
- ఆ దెబ్బకు అక్కడికక్కడే కూలిపోయిన వ్యక్తి
- రెండు రోజుల తరువాత ఆసుపత్రిలో మృతి
Nagpur: ఆ దెబ్బకు అక్కడికక్కడే కూలిపోయిన వ్యక్తి..
మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన ఓ అధికారి 54 ఏళ్ల వ్యక్తి చెంపపై బలంగా కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మృతి చెందాడు. వథోడా పోలిస్ స్టేషన్ పరిధిలోని మాతా మందిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం (సెప్టెంబర్ 21న) రాత్రి ఎస్ఆర్పీఎఫ్కు చెందిన నిఖిల్ గుప్తా(30) తన చెల్లెల్ని చూసేందుకు నాగ్పూర్ కు వచ్చారు. ఆమె ఇంటి దగ్గర కారు పార్క్ చేస్తుండగా హెడ్లైట్ హైబీమ్లో ఉండటంతో మురణీధర్ రామరావ్జీకు లైట్ ఫోకస్ ఇబ్బంది పెట్టింది. దీంతో లైటు లోబీమ్లో పెట్టి కారు పార్కు చేయాలని మురణీధర్ రామరావ్జీ సూచించారు.
Also Read: Sreeleela: ప్రభాస్ తదుపరి చిత్రంలో శ్రీలీల… ఎప్పుడంటే.?
ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నిఖిల్ గుప్తా, మురణీధర్ రామరావ్జీ చెంపపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా శనివారం (సెప్టెంబర్ 23న) మృతి చెందాడు . దీంతో, పోలీసులు నిఖిల్ పై కేసు నమోదు చేశారు.