Home   »  జాతీయం   »   మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు…!

మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు…!

schedule mahesh

చెన్నై : ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలకు ఓటమి భయం పట్టుకుందని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు.

స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుందన్న మాజీ CM Palaniswami

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తో పాటు డీఎంకే నేతలకు ఓటమి భయం పట్టుకుందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి (Palaniswami) మండిపడ్డారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.

కొత్త ఓటర్లు చేర్పు, నకిలీ ఓటర్లను తొలగించే విషయంపై సీఎం స్టాలిన్‌ చేస్తున్న ప్రసంగాల్లో తనకు ఎలాంటి ఆక్షేపణ లేదని తెలిపారు. కానీ ఎక్కడకు వెళ్ళిన తనను విమర్శిస్తూ ప్రసంగిస్తున్నారని అన్నారు. అంటే సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది అని అన్నారు.

కొత్త ప్రాజెక్టులేవీ అమలు చేయలేదన్న మాజీ CM

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే డీఎంకే నేతలకు భయం పట్టుకుందనే విషయం వారి మాటలు, చేష్టల్లోనే తెలిసిపోతుందని ఎడప్పాడి పళనిస్వామి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

తమిళనాడు రాష్ట్రంలో గతంలో అన్నాడీఎంకే హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు మినహా ముఖ్యమంత్రి కొత్త ప్రాజెక్టులేవీ అమలు చేయలేదని, కేవలం రిబ్బన్‌ను మాత్రమే కత్తిరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.