Home   »  అంతర్జాతీయంజాతీయం   »   దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..

దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..

schedule mounika

ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరివెళ్లారు. ఆదేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు జోహన్నెస్బర్గ్ లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సమ్మిట్ కు ప్రధాని హాజరుకానున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 22-24 మధ్య దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు.

ప్రత్యేక కార్యక్రమంలో “బ్రిక్స్ – ఆఫ్రికా ఔట్రీచ్ మరియు బ్రిక్స్ ప్లస్ డైలాగ్”లో కూడా పాల్గొంటారు. ఇందులో దక్షిణాఫ్రికా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఆహ్వానించిన ఇతర దేశాలు ఉంటాయి. జోహన్నెస్బర్గ్ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. అయితే వీరి భేటీపై భారత విదేశాంగ శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.