న్యూఢిల్లీ : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి (Prime-minister) నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయడం జరిగింది. దేశంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఇవాళ ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ప్రధాని మోడీ వెల్లడించారు.
దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ వెల్లడించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మార్చి 2020 నుంచి ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. దింతో మరో ఐదు ఏళ్ళు పాటు పేద ప్రజలు ఉచిత రేషన్ అందుకోనున్నారు.