ప్రధానాంశాలు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర 26వ గవర్నర్గా రఘుబర్ దాస్ (Raghubar Das) మంగళవారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది.
ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయిన సీఎం, కేంద్ర మంత్రి
ఒరిస్సా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి దాస్తో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావటం జరిగింది.
లింగరాజ ఆలయాన్ని సందర్శించిన Raghubar Das
రఘుబర్ దాస్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్భవన్లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఉదయం ప్రమాణ స్వీకారానికి ముందు దాస్ ఒడిశా లోని ప్రసిద్ధ లింగరాజ ఆలయాన్ని సందర్శించి లింగరాజ స్వామిని దర్శించుకున్నారు.
ఒడిశా రాష్ట్రం మరియు మన దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థించాను.
సోమవారం పూరీకి వచ్చిన తర్వాత దాస్ జగన్నాథునికి ప్రార్థనలు చేశారు. రఘువర్ దాస్ సీనియర్ బిజెపి నాయకుడు 2014 నుండి 2019 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేసాడు.