Rahul Gandhi | లిక్కర్ పాలసీ స్కామ్లో ED అరెస్ట్ చేసిన ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు కలవనున్నారు. కేజ్రీవాల్ అరెస్టును రద్దు చేయాలని తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, అత్యవసర విచారణను కోరామని మంత్రి అతిషి తెలిపారు.
ప్రధానాంశాలు
మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)చే అరెస్టు కాబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని నేడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కలవనున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ మంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానేయాలని BJPని కోరారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న BJP: మంత్రి అతిషి
BJP ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యమంత్రులను (జార్ఖండ్ CM హేమంత్ సోరెన్ మరియు కేజ్రీవాల్) జైలులో పెట్టడంతోపాటు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు. ఈ పనులన్నీ చేసి ఎన్నికల్లో గెలవవచ్చని BJP భావించి ఉంటుందని అతిషి అన్నారు.
కేజ్రీవాల్ అరెస్టును రద్దు చేయాలని తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, అత్యవసర విచారణను కోరామని అతిషి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేజ్రీవాల్ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ కుటుంబం వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు.
కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఎన్నికల కారణంగా ఒకరిని టార్గెట్ చేయడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అయితే, గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ED అధికారులు కేజ్రీవాల్ ఇంటికి వచ్చి వారెంట్ చూపించిన తర్వాత ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఇప్పటికే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, MP సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు.
Also Read: ED దర్యాప్తునకు సిద్దమైన కేజ్రీవాల్..!