Sharad Pawar | మహాఘట్బంధన్ను వీడి NDA కూటమిలో చేరిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై NCP నేత శరద్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ NDAలో చేరాలని నితీశ్ కుమార్ ఎందుకు నిర్ణయించుకున్నారో తనకు తెలియదన్నారు.
Sharad Pawar | ఎన్నో ఏళ్లుగా BJPకి వ్యతిరేకంగా మాట్లాడిన JDU అధినేత హఠాత్తుగా ఎందుకు మాట మార్చారో తెలియడం లేదన్నారు. భవిష్యత్తులో ప్రజలే నితీష్ కుమార్ కు బుద్ధి చెబుతారన్నారు. ఇంత తక్కువ సమయంలో, రోజుల వ్యవధిలో ఓ నేతలో ఇలాంటి మార్పును ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.
నితీశ్ కుమార్కు ప్రజలు బుద్ధి చెబుతారన్న Sharad Pawar
BJP వ్యతిరేక కూటమిలోని పార్టీలు గతంలో పాట్నాలో సమావేశమయ్యాయని, నితీశ్ కుమార్ వారిని ఆహ్వానించారని గుర్తు చేయడం జరిగింది. అయితే గత పదిహేను రోజులుగా ఆయనలో మార్పు వచ్చింది. కూటమి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి NDAలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేసారు. INDIA కూటమిలో నితీష్ కుమార్ పాత్ర కీలకంగా ఉండేదన్నారు. అతను సిద్ధాంతాన్ని వదిలి BJPతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. నితీశ్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని అన్నారు.
Also Read | రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!