Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఐదు పర్యాయాలు లోక్సభ MPగా పనిచేసిన సోనియా గాంధీ, 77 ఏళ్లలో ఎగువ సభలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ముగ్గురు నేతల ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో, ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీ చేయకపోవడంతో ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు తెలిపారు.
రాజ్యసభకు తొలిసారి ఎన్నికైన Sonia Gandhi
ఐదు పర్యాయాలు లోక్సభ MPగా పనిచేసిన సోనియా గాంధీ, 77 ఏళ్లలో ఎగువ సభలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999 లో తొలిసారిగా MPగా ఎన్నికయ్యారు. ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభలో సభ్యురాలుగా కొనసాగిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత గాంధీ కుటుంబంలో రాజ్యసభలో ప్రవేశించిన రెండవ సభ్యురాలు సోనియానే కావడం గమనార్హం.
15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్నారు మరియు ఫిబ్రవరి 27న ఈ స్థానాలకు EC ఎన్నికలు నిర్వహించనుంది.
Also Read | రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన అస్సాం CID..!