Home   »  జాతీయం   »   కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైలు

కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైలు

schedule sirisha
Train Cancelled Cancellation of many trains until November 5!

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (SCR) మూడవ ట్రాక్ పనులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ టౌన్ – లింగంపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైలు సెప్టెంబర్ 1-13 వరకు రైలు నంబర్ 07439 కాకినాడ టౌన్ – లింగంపల్లి వరకు నడపనున్నారు. కాకినాడ టౌన్ నుండి రాత్రి 9.10 గంటలకు బయలుదేరి ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. సెప్టెంబరు 2-14 వరకు రైలు నెం. 0740 లింగంపల్లి – కాకినాడ టౌన్ వరకు నడపనున్నారు. ఈ రైళ్లు లింగంపల్లిలో సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.