Home   »  జాతీయం   »   ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

schedule sirisha

రాజస్థాన్‌: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాజస్థాన్‌ కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. మహారాష్ట్రకు చెందిన ఆవిష్కార్‌ అనే విద్యార్ది ఆదివారం కోచింగ్‌ సెంటర్‌ బిల్డింగ్‌ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తలకు గాయాలవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే విధంగా బీహార్‌ కు చెందిన ఆదర్శ్‌ రాజ్‌ అనే యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇద్దరు విద్యార్థులు వేరు వేరు చోట్లల్లో ఒకే విధంగా అత్మహుతికి పాల్పడ్డారు. దీంతో ఈ ఏడాది విద్యార్ధుల ఆత్మహత్యలు అంతకంతకు పెరుగుతున్నాయి.