ప్రధానాంశాలు
J&K : కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం కీలక సంఘటన జరిగింది. పాకిస్థాన్ టేర్రరిస్టులు, భారత భద్రతా దళాల మధ్య పరిగామ్ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి.
ఉన్నత వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత భద్రత దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఎదురుకాల్పులకు దిగారు.
భద్రత దళాలకు చిక్కిన ఇద్దరు ఉగ్రవాదులు (Terrorist-attack)
కనీసం ఇద్దరు టెర్రరిస్టులు భద్రతా వలయంలో చిక్కుకున్నట్టు తెలిపారు. పరిగామ్ ప్రాంతంలో టెర్రరిస్టుల కదలికపై అందిన సమాచారంతో పోలీసులు, ఆర్మీ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు అధికారులు వెల్లడించారు.