Home   »  జాతీయం   »   భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు

భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు

schedule raju

G-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. 20 దేశాల మధ్య జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ఈ సదస్సులో ఆయన పాల్గొంటారని శ్వేత సౌధం ప్రతినిధి తెలిపారు. కూటమికి మోదీ అందిస్తున్న సారథ్యం, కూటమి దేశాల ఆర్ధిక సహకారానికి అమెరికా కట్టుబడి ఉన్న తీరు గురించి జో బైడెన్‌ ప్రస్తావిస్తారన్నారు.  

జీ20 సమ్మిట్‌ నేపథ్యంలో సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. సదస్సు జరిగే రోజుల్లో ఢిల్లీలోని కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.