Home   »  జాతీయం   »   Uttar Pradesh: పెళ్లి అయిన 3వ రోజే యువకుడు ఆత్మహత్య..

Uttar Pradesh: పెళ్లి అయిన 3వ రోజే యువకుడు ఆత్మహత్య..

schedule ranjith

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని ఉన్నావ్‌లో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.. మంగళవారం ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అతడు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

Uttar Pradesh లో షాకింగ్ సంఘటన

దీపు గౌతమ్ గ్రామం వెలుపల చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో యువకుడి భార్య షాక్‌కు గురైంది.

దీపు గౌతమ్ కు అక్టోబర్ 22న వివాహం

మృతుడి పేరు దీపు గౌతమ్.కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల విచారణ ప్రకారం, దీపుకు అక్టోబర్ 22న బల్వంత్ ఖేడా గ్రామంలో నివసించే అమ్మాయితో వివాహం జరిగిందని చెప్పారు. పెళ్లయిన మూడు రోజులకే అక్టోబర్ 25న ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దీపు వైవాహిక జీవితం ఆనందంగా సాగింది.

నలుగురు తోబుట్టువుల్లో దీపు చిన్నవాడు

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీపు కుటుంబం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోలీసుల విచారణలో తన మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. నలుగురు తోబుట్టువుల్లో దీపు చిన్నవాడు.

Also Read: Rajasthan: తమ్ముడిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన అన్న..