Home   »  జాతీయం   »   voilence |మణిపూర్ లో మరోసారి చెలరేగిన హింసాత్మక అల్లర్లు

voilence |మణిపూర్ లో మరోసారి చెలరేగిన హింసాత్మక అల్లర్లు

schedule mahesh

మణిపూర్ : మణిపూర్ లో మరోసారి హింసాత్మక అల్లర్లు (voilence) చెలరేగాయి. మణిపూర్ లో నిత్యం ఏదో ఓ చోట నిరసనకారులు ఆందోళనలు చేస్తూప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.

ఇళ్లకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు (voilence)

తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో గుర్తు తెలియని దుండగులు ఇళ్లకు నిప్పు పెట్టారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లా పట్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ కెయిథెల్ మన్బిలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు.

అనంతరం దుండగులు రెండు ఇళ్లకు నిప్పు పెట్టి అక్కడ నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భద్రతా బలగాలు మంటలను అదుపులోకి తీసుకురావటం వల్ల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

కుకీ, మైతేయి తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన వివాదం

మణిపూర్ రాష్ట్రంలో కుకీ, మైతేయి తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన వివాదం చినికి చినికి గాలి వానలా మరి రాష్ట్రాన్ని రావణ కాష్టం ల మార్చారు. ఇరు వర్గాల ఘర్షణలతో రాష్ట్రం అగ్ని గుండం ల మారింది. అనంతరం జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 175 మంది అమాయక ప్రజలు బలయ్యారు.

వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. అదే టైంలో ఓ వర్గం మహిళలపై లైంగిక దాడులు జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ హింసను ఆపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవడంతో సుప్రీంకోర్టు ఇరు ప్రభుత్వాలకు మందలించింది.