తిరుమలలో భక్తుల రద్దీ నేటికీ కొనసాగుతోంది. 20 కంపార్ట్మెంట్లలో టోకెన్ రహిత శ్రీవేంకటేశ్వరుని సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. దీనికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. కాలినడకన వెళ్లే భక్తులకు శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతుంది.
సోమవారం నాడు మొత్తం 64,347 మంది భక్తులు తిరుమలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా అదనంగా 28,358 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ హుండీకి రూ.కోటి ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఈ నెల మొదలైనప్పటి నుండి 5.11 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.