హైదరాబాద్ : బెగ్గింగ్ మాఫియా లో 23 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. దీనికి ప్రభుత్వం ఆలస్యంగానైన స్పందించింది. టాస్క్ఫోర్స్ పోలీసులు బెగ్గింగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. రాకెట్ను టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద 23 మంది యాచకులను అరెస్ట్ చేశారు. సిగ్నల్ లైట్లు పడిన వెంటనే ఆ పక్కనే ఉన్న కొందరు కారుల వద్దకు వచ్చి చేయి చాచడం అందరికీ అనుభవమే. హైదరాబాద్లో రూ.2 కోట్లుపైనే ఈ బిజినెస్ సాగుతోంది. అయితే ఈ డబ్బంతా రోడ్లపై యాచిస్తున్న వారి జేబుల్లోకి వెళ్లడం లేదు. వారిని పనిలో పెట్టుకున్న మాఫియా సొంతం అవుతున్నది. నగరంలోని సిగ్నల్ పాయింట్లు, ఆలయాలు ఇలా జనసముహం అధికంగా వున్న ప్రాంతాలను బెగ్గింగ్ మాఫియా అడ్డాగా చేసుకుని, పక్క రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పసిపిల్లలు, మహిళలతో భిక్షాటన చేయిస్తున్నారు. వారికి టార్గెట్లు పెడుతున్నారు. టార్గెట్ రీచ్ కాకుంటే దాడులు చేస్తున్నారు.
బెగ్గింగ్ మాఫియా లో 23 మంది అరెస్ట్.
Related News
Also Read