INDIA లో 54 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదు కాగా మొత్తం కేసులు 1,574 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(ఈ రోజు) తెలిపింది. మరణాల సంఖ్య 5,31,918గా ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసిన డేటాను వెల్లడించింది.
ఇప్పటివరకు INDIA లో మొత్తం 4.49 కోట్ల (4,49,96,034) కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం, వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,62,542 కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. కేసు మరణాల రేటు 1.18 శాతం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.