Home   »  వార్తలుఆంధ్రప్రదేశ్   »   కిలో టమాటా రూ.50 .. క్యూలు కట్టిన జనం ఎక్కడో తెలుసా?

కిలో టమాటా రూ.50 .. క్యూలు కట్టిన జనం ఎక్కడో తెలుసా?

schedule raju

ఒంగోలులోని రైతు బజార్‌లో సబ్సిడీపై కిలో టమాటా రూ.50 చొప్పున విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. పట్టణంలోని మూడు రైతు బజార్లలో – కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లో, లాయర్ పేట్ వద్ద మరియు డొంక రోడ్డులో – సబ్సిడీపై టమోటాల విక్రయం తెల్లవారుజామున ప్రారంభమైంది.

సుమారు 2 కి. మీ మేర ప్రజలు బారులు తీరారు. కాగా, బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా ధర రూ. 120 నుండి రూ. 150 వరకు పలుకుతుంది.