Home   »  వార్తలు   »   ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో వింత ఘటన..

ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో వింత ఘటన..

schedule mounika


ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి పాల్పడిన దొంగలు పారిపోయే సమయంలో పిల్లి ఎదురు రావడంతో అపశకునంగా భావించి వెళ్లకుండా కొంతసేపు ఆగారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిని MPకి చెందిన పాఠక్, సైనిక్, రాహుల్ గా గుర్తించి వారి నుంచి డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కోసం వెతుకుతుండగా అనుకోకుండా చిక్కినట్లు అధికారి తెలిపారు.