Home   »  వార్తలు   »   కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ, ఇద్దరు పిల్లలు మృతి

కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ, ఇద్దరు పిల్లలు మృతి

schedule sirisha

హైదరాబాద్: బన్సీరాల్‌పేట జిల్లా గాంధీనగర్‌లో 26 ఏళ్ల యువతి కుటుంబ కలహాల వల్ల తన ఇద్దరు పిల్లలతో కలిసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలు సౌందర్యకు గణేష్‌తో 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు బన్సీలాల్‌పేటలోని ప్రభుత్వ భవనంలో ఉంటున్నారు. ఈ జంటకు కవల పిల్లలునిదీష్, నిత్య కీ దాదాపు రెండు సంవత్సరాల వయస్సు ఉంటుంది.

కుటుంబ సమస్యలపై దంపతులు గొడవపడి గణేష్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సౌందర్య తన పిల్లలతో కలిసి భవనం పై అంతస్తు ఎక్కి దూకింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

సౌందర్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అదనపు కట్నం కోసం గణేష్ తన భార్యను తరచూ వేధించేవాడు మరియు హింసించేవాడు అని చెప్పారు.