ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో Samrudhi Expressway మూడో దశ నిర్మాణంలో భాగంగా ఈ రోజు ఉదయం బ్రిడ్జి స్లాబ్పై క్రేన్ పడిపోవడంతో 17 మంది కార్మికులు మృతి చెందగా, ముగ్గురు గాయపడినట్లు అధికారి తెలిపారు.
ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎన్డిఆర్ఎఫ్ అధికారి తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
థానే జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన బాధను కలిగించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని తెలిపిన PM నరేంద్ర మోడీ. ఈ ప్రమాదం లో మరణించిన ప్రతి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం అని మోదీ తెలిపారు.