రామచంద్రాపురం-కోదండరాంపురం మధ్య మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వృద్ధురాలు శవమై కనిపించింది.
పోలీసుల కథనం ప్రకారం.. సక్కుబాయమ్మ మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఆమె కనిపించకపోవడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
స్థానికులు ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు కూడా మాయమయ్యాయి.
శవమై కనిపించిన ఓ వృద్ధురాలు….. అసలేం జరిగింది ఆమె ఒంటి మీద వున్న బంగారం ఏమైంది అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.