హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో ఉగ్రవాది ని NIA అరెస్ట్ చేసింది. హైదరాబాద్-భూపాల్ మాడ్యూల్ కేసులో దర్యాప్తు చేపట్టిన NIA.. సల్మాన్ ను అదుపులోకి తీసుకుంది. అతనికి చెందిన 2 ఇళ్లలో సోదాలు నిర్వహించి ఎలక్ట్రానిక్ వస్తువులు, హార్డ్ డిస్క్, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. హట్ ద్వారా యువతను రిక్రూట్ చేసుకుని, భారత్లో కుట్రకు అతను ప్లాన్ చేస్తున్నట్లు NIA తెలిపింది.
ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బందితో కలిసి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరు జరిపిన దర్యాప్తులో ఉగ్రవాదుల నెట్వర్క్ వేర్వేరు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నట్టు వెళ్లడయ్యింది. ఈ క్రమంలో NIA రంగంలోకి దిగింది. తాజాగా NIA అధికారులు రాజేంద్రనగర్ ప్రాంతంలో సల్మాన్ అనే మరో ఉగ్రవాది ని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు హైదరాబాద్లో అరెస్ట్ అయిన ఉగ్రవాదుల సంఖ్య 17కు పెరిగింది.