హైదరాబాద్: మీరు బీఆర్ఎస్ పోలీసులా లేక తెలంగాణ పోలీసులా,రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి కిషన్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలోని భూ మార్పిడికి స్థానిక రైతులు, ప్రజలు వ్యతిరేఖిస్తున్నా ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు తీసుకురావడాన్ని వారు తీవ్రంగా కండించారు. మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే యేలేటి మహేశ్వరరెడ్డి నిరాహార దీక్షకు దిగారని కిషన్ రెడ్డి తెలిపారు.
సమస్యను పరిష్కరించేందుకు బదులుగా ప్రభుత్వం పోలీసులతో విచక్షణారహితంగా బిజెపి నాయకులపై, రైతులపై లాఠీఛార్జ్ చేసింది. సుమారు 30 మంది యువకులు గాయపడ్డారు మరికొందరికి తలల కి గాయాలయ్యాయి. నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యేకు మద్దతు తెలిపేందుకు నిర్మల్కు వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.