Home   »  వార్తలుఅంతర్జాతీయంక్రీడలు   »   500 వికెట్లు తీసిన అశ్విన్‌-జడేజా

500 వికెట్లు తీసిన అశ్విన్‌-జడేజా

schedule yuvaraju

భారత స్పిన్‌ ద్వయం అశ్విన్‌-జడేజా అరుదైన ఘనత సాధించారు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన రెండో భారత జోడీగా నిలిచారు. వీరి కన్నా ముందు కుంబ్లే-హర్భజన్‌ 54 టెస్టుల్లో 501 వికెట్లు తీశారు. కాగా అశ్విన్‌-జడేజా 49 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకోగా అశ్విన్‌ 274, జడేజా 226 వికెట్లు తీయడం గమనార్హం. మరో 2 వికెట్లు తీస్తే కుంబ్లే-హర్భజన్‌ రికార్డును అధిగమించనున్నారు.