Home   »  వార్తలు   »   బి.టెక్ విద్యార్థి ఆత్మహత్య

బి.టెక్ విద్యార్థి ఆత్మహత్య

schedule sirisha

విశాఖపట్నం: విశాఖపట్నంలో కార్తీక్ (21) అనే విద్యార్థి సముద్రంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. క్యాంపస్ నుంచి ఎనిమిది రోజుల క్రితం విద్యార్థి అదృశ్యమయ్యాడు. కార్తీక్ నల్గొండ జిల్లాకు చెందిన IIT-H, బి.టెక్ ద్వితీయ సంవత్సరం (మెకానికల్) విద్యార్థి.

జూలై 17న IIT క్యాంపస్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతడి తల్లిదండ్రులు జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు చేయగా కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖపట్నం చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొ. మూర్తి ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖపట్నానికి పంపారు. ఆర్కే బీచ్ వద్ద కార్తీక్ మృతదేహం ఆచూకీ లభించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.