తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ )చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు AP ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరుణాకర్ రెడ్డి గతంలో 2006 నుంచి 2008 వరకు TTD చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన భూమన తనకు TTD చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా గట్టిగా కోరినట్లు తెలిసింది. చివరికి ఆయన కోరిక మేరకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది. ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం ఈ నెల 16వ తేదీతో ముగుస్తుంది. ఈ క్రమంలో టీటీడీ కొత్త చైర్మన్గా భూమనకరుణాకర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వై.వి.సుబ్బారెడ్డి ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నారు.
TTD చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి
Related News
Also Read