వరంగల్:రోడ్డు ప్రమాదము లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన హన్మకొండ జిల్లా అనంతసాగర్ కూడలి వద్ద చోటుచేసుకుంది. మృతులను రైల్వేలో ట్రైనీ టికెట్ కలెక్టర్ ఎప్పలపల్లి శివరామ్ (24), సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అతని సోదరుడు హరికృష్ణ (23)గా గుర్తించారు. వీరి మరణవార్తతో వారి తల్లిదండ్రులు బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. వీరు పొరుగున ఉన్న కరీంనగర్ జిల్లా కందుగుల గ్రామానికి చెందిన ఎప్పలపల్లి మనోహర్ కుమారులు.
సూర్యోదయానికి ముందే గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో వీరిద్దరూ ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన సమయంలో ఈ రోడ్డు ప్రమాదము జరిగింది. తెల్లవారుజామున 5:39 గంటల ప్రాంతంలో అనంతసాగర్ చౌరస్తా వద్ద వేగంగా వస్తున్న వాహనం మరొకరిని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సంఘటనా స్థలాన్ని ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎల్కతుర్తి పోలీసులు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.