Home   »  వార్తలు   »   బస్సు డ్రైవర్‌పై దుండగుల దాడి

బస్సు డ్రైవర్‌పై దుండగుల దాడి

schedule sirisha

సూరారం: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సూరారం వద్ద సోమవారం TSRTC బస్సు డ్రైవర్‌పై మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వారు బైక్ మీద వచ్చి బస్సు కు అడ్డంగా పెట్టి బస్సులోకి ఎక్కి డ్రైవర్‌పై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.

సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు మద్యం మత్తులో ఉన్న గంజాయి బానిసలు బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారని చెప్పారు.

ఘటనానంతరం డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో ముక్కు నుంచి రక్తం రావడంతో సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.