భోపాల్ నుంచి ఢిల్లీకి వస్తున్న వందేభారత్ రైలులో సోమవారం ఉదయం 6.45 గంటలకు C-12 కోచ్లోని బ్యాటరీ బాక్స్లో మంటలు చెలరేగాయని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదలై సోషల్ మీడియాలో శరవేగంగా వ్యాపిస్తోంది. C-12 కోచ్లో 20-22 మంది ప్రయాణికులు ఉండడంతో వారిని వెంటనే ఇతర కోచ్లకు తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
వందే భారత్ రైలులో అగ్ని ప్రమాదం.
Related News
Also Read