Home   »  వార్తలుఉద్యోగం   »   మెగా డీఎస్సీ ప్రకటించాలని అభ్యర్థుల ఆందోళన..

మెగా డీఎస్సీ ప్రకటించాలని అభ్యర్థుల ఆందోళన..

schedule mounika

తెలంగాణ: హైద్రాబాద్ విద్యాశాఖ కార్యాలయం వద్ద టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తక్కువ సంఖ్యలో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరసనకు దిగారు. మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ MP కృష్ణయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. టిఆర్టి అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడి కోసం గేటు దగ్గరకు వెళ్లడంతో.. ఒక్కసోరిగా ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. టిఆర్టి అభ్యర్థులు ఆందోళన చేపట్టడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో అసెంబ్లీ వైపు చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో అభ్యర్థులపై లాఠీఛార్జి చేశారు.