Home   »  వార్తలుజీవన శైలితెలంగాణ   »   వరదల్లో కొట్టుకుపోయిన పశువులు..పాలు లేక దూడలు మృతి

వరదల్లో కొట్టుకుపోయిన పశువులు..పాలు లేక దూడలు మృతి

schedule yuvaraju

భూపాలపల్లిలోని మోరంచవాగు 4 రోజులు క్రితం పొంగిపొర్లినప్పటికీ ఆ దుర్భర రాత్రిని మోరంచపల్లి గ్రామ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. తమ పశువులు వరదలో కొట్టుకుపోయాయని, పాలు లేకపోవడంతో కొన్ని దూడలు(పశువులు) చనిపోయాయని వారు విలపిస్తున్నారు. పొలాల్లోకి తీసుకెళ్లాల్సిన ఎరువుల బస్తాలు పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.