సైబర్ నేరగాళ్లు మళ్ళీ చెలరేగుతున్నారు. వాట్సాప్ కాల్ చేసి కొత్త స్కీముల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. +92 కంట్రీ కోడ్ తో ఫోన్ చేసి ఆపిల్, ఐఫోన్ ఇస్తామని నమ్మించి అమౌంట్ అడుగుతున్నారు. ఆ నెంబర్ తో కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పాకిస్తాన్ కోడ్ +92 ని ఉపయోగించి భారతదేశం లో సైబర్ నేరగాళ్లు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు అని అధికారులు వెల్లడించారు.