తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసారు. పిల్లలు సమర్థవంతంగా నేర్చుకుని ఎదగాలనే ఆత్మవిశ్వాసంతో యువకులను శక్తివంతం చేయాలని తెలిపారు.
2022-23 సంవత్సర పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 10వ, 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక నగదు బహుమతులతో ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించి బాగా చదివేలా చేయాలని గవర్నర్ అన్నారు.