రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నిర్వహించిన Mango Festival లో అంతర్జాతీయ మార్కెట్లో రూ.2.70 లక్షల ధర కలిగిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి ‘మియాజాకి’ ని ప్రదర్శించారు.
జూన్ 17 నుంచి 19 వరకు రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన Mango Festivalలో జపాన్కు చెందిన ప్రసిద్ధ మామిడి ‘మియాజాకి’ ప్రదర్శించబడింది. ఈ మామిడి ధర కిలో రూ. 2.70 లక్షలు అని నిర్వాహకులు తెలిపారు.
Festivalలో మామిడి పండ్లను ప్రదర్శించిన RP గుప్తా (రిటైర్డ్ జనరల్ మేనేజర్ కోల్ ఇండియా) మాట్లాడుతూ ఈ మామిడిని పెంచడానికి చాలా శ్రద్ధ అవసరం. ఇది కార్పొరేట్ బహుమతిగా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ మామిడి ధర సాధారణ మామిడి కంటే ఎక్కువగా ఉంటుంది.
“ఈ మామిడికాయలో ఒక భాగం భిన్నమైన రుచిని కలిగి మరొక భాగం విచిత్రమైన అభిరుచిని కలిగి ఉంటుంది” ఒక ‘మియాజాకి‘ మామిడి పండు బరువు 639 గ్రాములు ఉంటుంది ఇది కేవలం జపాన్లో పండుతుందని ఆయన తెలిపారు.