Home   »  వార్తలు   »   “ఆర్టీసీ బస్సు” ఢీకొని వృద్ధురాలు మృతి..

“ఆర్టీసీ బస్సు” ఢీకొని వృద్ధురాలు మృతి..

schedule ranjith

కరీంనగర్‌: కరీంనగర్ జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. నగరంలోని బస్టాండ్‌ ముందు రోడ్డు దాటుతుడగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలోని వృద్ధురాలుని వెంకవ్వ గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్‌, బస్సును వన్‌ టౌన్‌ పోలీసులు స్టేషన్‌ కు తరలించారు. అసలు ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూన్నారు.