Home   »  వార్తలుతెలంగాణ   »   హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్‌కు వీడ్కోలు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్‌కు వీడ్కోలు.

schedule raju

హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్‌ కు తెలంగాణ హైకోర్టు వీడ్కోలు పలికింది. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మొదటి కోర్టు హాలులో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉజ్జల్ భుయాన్‌ను హైకోర్టు బార్ అసోసియేషన్ సన్మానించింది.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల చేసిన సిఫారసులకు కొలీజియం ఆమోదం తెలిపిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం ట్విట్టర్‌లో తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భట్టి ఉన్నారు. భుయాన్ జూన్ 28, 2022 నుండి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.